టీడీపీని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఐదేళ్ల పాలనపై సిట్ వేసిన చరిత్ర ప్రంపచంలోనే ఎక్కడా లేదని అన్నారు. వైఎస్ జగన్ అవినీతిపై విచారణ న్యాయస్థానాల్లో ముగింపు దశకు చేరిందని, ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.
గత టీడీపీ పాలనపై జగన్ ప్రభుత్వం అనేక విచారణలు జరిపిందని యనమల చెప్పారు. అయినప్పటికీ ఏ ఆరోపణనూ రుజువు చేయలేక పోయారని అన్నారు.వైసీపీ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని తాము కోరామని యనమల చెప్పారు. తాము ఈ డిమాండ్పై వెనక్కి తగ్గట్లేదని తెలిపారు. హత్యలకన్నా ఆర్థికనేరాలు ప్రమాదకరమైనవని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపారు.