ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి జగన్ వినతిపత్రాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. మోదీకి సమర్పించిన వినతిపత్రంలో ఏముందో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.
ప్రధానికి అందించిన వినతిపత్రంలో మీకు నచ్చిన అంశాలను మాత్రమే ప్రజలకు చెబుతారా? అని అడిగారు. కేంద్రం నిధులు ఇస్తేనే పోలవరం ప్రాజెక్టులో ఇటుక పెడతానని చెప్పడంలో అంతరార్థం ఏమని యనమల ప్రశ్నించారు. మీరు చేస్తున్న విచారణకు, కేంద్ర నిధులకు సంబంధం ఏమిటని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రులు చెబుతుంటే… జగన్ కానీ, వైసీపీ ఎంపీలు కానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అమరాతిలో చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్