ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు ఉదయం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఢిల్లీ టూర్తో రాష్ట్రానికి ఒక్క రూపాయి ప్రయోజనం లేదు. జగన్ను ఢిల్లీకి పిలిపించి ప్రధాని చీవాట్లు పెట్టారని మాకు సమాచారం ఉందన్నారు . సీఎం మళ్ళీ రేపు ఢిల్లీ వెళ్ళేది సొంత విషయాల కోసమేనా? అని ఆయన ప్రశ్నించారు.
ఏడు సార్లు ప్రధాని, కేంద్ర హోంమంత్రిని జగన్ కలిశారు. కానీ కేంద్రం నుంచి విమాన చార్చీలు కూడా తెచ్చుకోలేకపోయారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ వెళ్లారా?. ఎన్ని నిమిషాలు మాట్లాడారో కాదు.. ఎన్ని నిధులు తెచ్చారు?.మోదీకి ఇచ్చిన వినతిపత్రం అంశాలను బయటపెట్టలేదు. నవరత్నాలకు కూడా కేంద్రమే సహాయం చేయాలి అనే రీతిలో సీఎం జగన్ మాట్లాడుతున్నారని యనమల చెప్పుకొచ్చారు.