శాసన మండలిని రద్దు చేయడం సీఎం జగన్ వల్ల కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… మండలి రద్దుకు తాము ఎప్పుడూ భయపడబోమని మరోసారి స్పష్టం చేశారు.శాసనమండలికి నిన్న కొంత మంది మద్యం తాగి వచ్చారని అన్నారు. కొందరు గుట్కాలు కూడా నములుతూ కనపడ్డారని తెలిపారు.
సభలో ఎన్నడూ చూడని పరిణామాలను ఏపీ మంత్రుల వల్ల నిన్న చూశామని యనమల చెప్పారు. తాను గతంలో సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్గానూ పని చేశానని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో రాజధానిపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి తగిన సమయం అవసరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలపై తాము పోరాడతామని ఆయన అన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది: యనమల