ఏపీ సీఎం జగన్ పై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ అసలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహనలేని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమన్నారు. ఆనాడు తుగ్లక్ ఆలోచనలకు కూడా ఆర్థికవ్యవస్థ సహకరించలేదని, నేడూ అంతే అని అన్నారు. ఆదాయ మార్గాలపై అన్వేషణ లేకపోవటం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవన్నారు.
మాఫీయాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు పాలన గుప్తుల స్వరయుగంలా ఉంటే జగన్ పాలన తుగ్లక్ పాలనతో సమానంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏవో కొన్ని కార్యక్రమాలు ప్రజలకు చేశామని చెప్పుకుంటున్నారు తప్ప ఆదాయమార్గాలన్నీ పడిపోయాయని ఆరోపించారు. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారన్నారని దుయ్యబట్టారు.