telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి: యనమల

Yanamala tdp

ఏపీ రాజధాని అమరావతి సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు సహకరిస్తానని బీజేపీ మాటిచ్చిందని అన్నారు. రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమేనని స్పష్టం చేశారు.

ఆర్టికల్ 355 (సి) మేరకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రభుత్వం చట్టం కూడా తీసుకువచ్చిన నేపథ్యంలో టీడీపీ ముమ్మర పోరాటం చేస్తోంది. చంద్రబాబు సహా ఇతర టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related posts