telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అడిగే దమ్ము, ధైర్యం జగన్‌కు లేవు: యామినీశర్మ

TDP Yamini fire to Ys Jagan

టీఆర్‌ఎస్‌ చేస్తున్న కుట్రలు, వేస్తున్న కేసుల గురించి నేరుగా అడిగే దమ్ము, ధైర్యం జగన్‌కు లేవని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ఎద్దేవా చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆమె మాట్లాడుతూ ఆంధ్ర ద్రోహులైన కేసీఆర్‌ అండ్‌ కంపెనీకి స్వయంగా అస్త్రాలు ఇస్తూ, పనులు ఆపాలని ఎన్ని కేసులు వేశారో జనం మరిచిపోలేదన్నారు.

సీఎంగా నాకు ఒక్క అవకాశమిస్తే, జల యజ్ఞానికి ప్రాముఖ్యత నిస్తాననడం నిజంగా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని సీఎంని చేస్తే, జగన్‌ వెనుకుండి జలయజ్ఞాన్ని… ధనయజ్ఞంగా మార్చేశారని విమర్శించారు. తెలంగాణలోని లోట్‌సపాండ్‌ నుంచి రాజకీయాలు చేసే జగన్‌ తెలంగాణలోనే పోటీ చేయాలి. జగన్‌ తెలంగాణలో పోటీచేస్తే ఆంధ్రకి పట్టిన దరిద్రం పోతుందని యామిని దుయ్యబట్టారు.

Related posts