telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

షర్మిల వ్యాఖ్యల పై మండిపడ్డ యామిని

TDP Yamini fire to Ys Jagan

వైఎస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యల పై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మండిపడ్డారు. చుట్టపు చూపుగా వచ్చిన షర్మిలకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న షర్మిల తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదన్నారు.

తన అన్న జగన్ సంపాదించిన అవినీతి సొమ్ములో వాటా ఉన్న షర్మిలకు రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ‘పసుపు-కుంకుమ’ కింద పదివేలు ఇస్తున్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. పోలవరం గురించి మాట్లాడిన షర్మిల.. ఏనాడైనా ఆ ప్రాజెక్టును సందర్శించారా? అని యామిని ప్రశ్నించారు. ఏపీపై మోదీ, కేసీఆర్ చేస్తున్న కుట్రలో జగన్ భాగస్వామి అని విమర్శించారు.

Related posts