telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన యామిని!

yamini sadineni on tdp success tomorrow

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల పై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మరోసారి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ పవన్ కల్యాణ్ మల్లెపూలను తప్ప దేన్నీ నలపలేరు అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు ఒక హద్దు అనేది ఉండాలన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ వ్యక్తిని పవన్ కల్యాణ్ తాట తీస్తాను, తోలు తీస్తాను అని పదేపదే అన్నారు.

అభిమానులు ఒక పార్టీ నాయకుడికి మాత్రమే ఉండరు. చంద్రబాబుకు కూడా ఉంటారన్నారు. నేను ఓ కానిస్టేబుల్ కొడుకుని అని పవన్ చెప్పుకున్నారు. ఓ నక్సలైట్ ను వెనకేసుకొచ్చారు. దీంతో నాయకులపై ఇష్టానుసారం విమర్శలు చేయడానికి వాళ్లేమీ మల్లెపూలు, చిత్తుకాగితాలు కాదు అని కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. నవ్యాంధ్ర నిర్మాణంలో చంద్రబాబుకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో తాను టీడీపీలో చేరారని ఆ పార్టీ తెలిపారు. అంతకుముందు తాను హామ్ రేడియోలో పనిచేస్తూ ప్రపంచదేశాలు తిరిగేదాన్నని చెప్పారు.

తాను అప్పుడప్పుడూ టీవీ డిబేట్లలో పాల్గొనేదాన్నని వ్యాఖ్యానించారు. సాధినేని యామినికి నోటి దూల ఎక్కువ. వాటి కారణంగానే ఆమెకు అనుకోకుండా అవకాశం వచ్చింది’ అని కొందరు సోషల్ మీడియాలో చెప్పడంపై ఆమె స్పందించారు.తన కంటే ఎక్కువ నోటిదూల, విషయ పరిజ్ఞానం ఉన్నవారు టీడీపీలో ఉన్నారనీ, ఈ లెక్కన వారందరికీ అవకాశాలు రావాలి కదా? అని ప్రశ్నించారు. సాధినేని యామిని ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు అనే ఆరోపణలను ఆమె ఖండించారు.

Related posts