మోదీ, కేసీఆర్, వైఎస్ జగన్లకు ఏపీ ప్రజలు మే 23న గుణపాఠం చెప్పడం ఖాయమని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేనియామిని అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని చెప్పుకొచ్చారు. ఈసారి మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
జగన్ ఒక టూరిస్ట్లా ఏపీకి వచ్చిపోతూవుంటారన్నారు.ఈసారి ప్రజాతీర్పు ఆయనకు వ్యతిరేకంగా ఏపీ ప్రజలు ఇచ్చారని జోస్యం చెప్పారు. పోలింగ్ తరువాత రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజల ఇబ్బందులపై జగన్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు కానీ టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ కోసం చేస్తారని విమర్శించారు. అసలు ఆర్జీవీకి ఎలా మద్దతుగా నిలుస్తారని ఆమె ఎద్దేవా చేశారు. మన పక్కరాష్ట్రం తెలంగాణలో తెలుగు విద్యార్థులు చనిపోతుంటే జగన్ ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు.