telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలు అప్పుడే పదవులు పంచుకుంటున్నారు: యామిని

TDP Yamini fire to Ys Jagan
  • టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని వైసీపీ నేతలపై విమర్శనస్త్రాలు సంధించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లు వైసీపీ నేతలు పొంగిపోతున్నారని విమర్శించారు. ఇక తమదే అధికారం అన్నట్టుగా అక్కడితో ఆగకుండా పోర్టుఫోలియోలు పంచుకోవడం ఇంకా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ ద్రోహుల కాంట్రాక్టు ఈ నెల 11న పోలింగ్ తర్వాత ముగిసిపోయిందని దుయ్యబట్టారు. ఎన్నికల సందర్భంగా ప్రతీసారి మోదీ ఓ కొత్త నినాదంతో వస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రతీసారి ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని యామిని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Related posts