telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీవో 2430పై రగడ ..తప్పుబట్టిన టీడీపీ నేత వర్ల

varlaramaiah tdp

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2430 జీవోపై రగడం కొనసాగుతోంది.మీడియాపై వైసీపీ సర్కారు విధించిన ఆంక్షలను టీడీపీ నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. ఈ విషయం పైఆయన ట్విట్టర్ లో స్పందించారు. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్‌గా సెటైర్లు పేల్చారు.

“విజయసాయి రెడ్డి గారూ.. ముఖ్యమంత్రి చెవిలో చెప్పండి ప్రజాస్వామ్యమంటే “నా శత్రువు నోరు విప్పకుండా చేసే బలం, బలగం, అధికారం నాకున్నప్పటికీ.. అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్శ లైన సరే.నా శత్రువు నోరు విప్పకుండా చేసే బలం, బలగం, అధికారం నాకున్నప్పటికీ.. అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్సలైన సరే.. అదే ప్రజా స్వామ్యం” అబ్రహం లింకన్. అర్ధమైనదా’ అన్నారు. వర్ల రామయ్య తన ట్వీట్‌లో అబ్రహం లింకన్ చెప్పిన మాటను వారిద్దరికి గుర్తు చేశారు.

మరోవైపు మీడియా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందంటూ జర్నలిస్టు సంఘాలు, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటూ జనసేన, బీజేపీతో పాటూ ఇతర పార్టీలు ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. అంతేకాదు ఈ జీవో అంశాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా కేసు స్వీకరించినట్టు తెలుస్తోంది.

Related posts