telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పేరుతో కలెక్షన్లు చేసుకుంటున్నారు: టీడీపీ నేత సోమిరెడ్డి

somireddy chandramohan

కరోనా పేరుతో కలెక్షన్లు చేసుకుంటున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన ప్రజల కోసం జరుగుతుందో లేక ప్రజాప్రతినిధుల కోసం జరుగుతుందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వచ్చిన నిధులను ఎక్కడ ఖర్చుపెట్టారో తెలియడం లేదని ఆయన ఆరోపించారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదవాళ్లకి పట్టెడన్నం పెట్టడానికి కూడా వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.120 కోట్లు భారం మోపారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యవసర సరుకులు కూడా భారీగా పెరిగిపోయాయని తెలిపారు. అంతేగాక, గతంలో చీప్ లిక్కరు క్వార్టర్ రూ.50గా ఉంటే, అది ఇప్పుడు రూ.200కు చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts