telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఏం కావాలనుకుంటున్నారు?: సోమిరెడ్డి

somireddy chandramohan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ఎస్ఈసీకి ఆమే లేఖ రాయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవితను ఫణంగా పెడుతూ ఎన్నికలు నిర్వహించాలని లేఖ రాయడం బాధాకరం అన్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే ఈ రోజు పోలింగ్ జరిగేదన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఏం కావాలనుకుంటున్నారు? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలే పంపిణీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Related posts