telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

విశాఖలో .. 31న టీడీపీ భారీ బహిరంగ సభ.. హాజరవనున్న కేజ్రీవాల్, మమత ..

Chandrababu Comments Jagan KCR

టీడీపీ 31న విశాఖపట్టణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జాతీయ నేతలు తరలిరానున్నారు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి విశాఖ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పోటీలో నిలవగా; వైసీపీ నుంచి సత్యనారాయణ; జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ; బీజేపీ నుంచి పురందేశ్వరి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చతుర్ముఖ పోరు రసవత్తరంగా మారనుంది.

భారీగా పోటీ ఉన్న ఇక్కడ విజయం సాధించడం అన్ని పార్టీలు ప్రధానంగా భావిస్తున్నాయి. ఈ లక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 31న నగరంలో నిర్వహించనున్న సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరు జాతీయ నాయకులను టీడీపీ ఆహ్వానించినట్టు సమాచారం.

Related posts