నేటి నుండి రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నేతలు అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
మంగళగిరి నుంచి సచివాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నుంచి సచివాలయానికి రూ. 10 ఉన్న టిక్కెట్ను రూ. 15 చేశారని, ఒకేసారి ఐదు రూపాయలు పెంచారని విమర్శించారు. కాగా అసెంబ్లీ సమావేశాలు మూడోరోజుకు చేరుకున్నాయి.