తెలంగాణలో టీడీపీకి రాను రాను కేడర్ లేకుండా పోతుంది. ఇతర పార్టీ నేతలు చాలా మంది కమలం గూటికి చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.
గతంలో హైదరాబాదుకు అమీత్ షా వచ్చినప్పుడు కోనేరు సత్యనారాయణ కలుసుకుని బీజేపీలో చేరేందుకు తాను సిద్ధమేనని ప్రకటించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీకి భవిష్యత్తు లేనందున తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు బీజేపీలో చేరుతున్నట్లు కోనేరు ప్రకటించారు.గతంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్లో చేరవలసిందిగా కోరినప్పుడు కూడా ఆయన పార్టీలో చేరలేదు.