telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీలన్నింటికీ ఎన్టీఆర్‌ మార్గదర్శి: మోత్కుపల్లి

Motkupalli Narasimhulu

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పార్టీలన్నింటికీ ఎన్టీఆర్‌ మార్గదర్శి అని మోత్కుపల్లి అన్నారు.

ఎన్టీఆర్‌ దైవ సమానులని, ఆయన సమాధి దేవాలయమని మోత్కుపల్లి అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ దారిలోనే బీజేపీ నడుస్తుందని, అందుకే బీజేపీలో చేరానని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.

Related posts