telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మార్ఫింగ్ వీడియోలతో అరెస్టు చేస్తారా?: లోకేశ్

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజామెత్తారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులను అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారని పార్టీ ఆవేదన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు ఆధారంగా చేసుకుని ఎలా అరెస్ట్ చేస్తారంటూ లోకేశ్ ప్రశ్నించారు. ఈ ఐదు నెలల్లో జగన్ సాధించింది ఒక్కటేనని, రాష్ట్రానికి మానవ హక్కుల కమిషన్ ను తీసుకువచ్చాడని ఎద్దేవా చేశారు. ఇవాళ వాళ్లకు కూడా రాష్ట్రంలో సరైన ఏర్పాట్లు చేయలేకపోతున్నారని విమర్శించారు.

దెందులూరు నియోజకవర్గాన్ని స్వంత నిధులతో అభివృద్ధి చేసిన చింతమనేని ప్రభాకర్ వంటి వ్యక్తులనున కూడా వదలడంలేదని, ఆయనను జైల్లో ఉంచి 51 రోజులైందని అన్నారు. రాష్ట్రంలో ఓ దొంగ పేపరు, ఓ దొంగ చానల్ ఉన్నాయని, వాటిని పెట్టింది ఓ దొంగబ్బాయ్ అని పరోక్షంగా ఓ మీడియా సంస్థపై వ్యాఖ్యలు చేశారు. ఆ మీడియాలో వచ్చే వార్తలను మీరు ఎలా సాక్ష్యాలుగా పరిగణిస్తారని నిలదీశారు.

Related posts