ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో అధికార, విపక్షాలు ఒకే తాటిపైకి వచ్చాయని, అది ఏపీ సీఎం వైఎస్ జగన్ పుణ్యమేనని మాజీ మంత్రివ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టారు.
“ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ పరిపాలన పుణ్యమా అని, ఒకే తాటిపైకి వచ్చిన పక్క రాష్ట్రం, పాలక పక్షం, ప్రతిపక్షం. పిచ్చి తుగ్లక్ పాలన వలన మన రాష్ట్రం బీహార్ తో పోటీ పడే స్థాయికి దిగజారడం చూసి మన కర్మ అని అనుకోడం తప్ప ప్రజలు చేసేది ఏమి లేదు” అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో మహాకూటమి.. ఏపీలో ముసుగు కూటమి: వైసీపీ ఆరోపణ