telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే: భువనేశ్వరి

Bhuvaneshwarichandrababu pass Eelections

మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఆయనకు భువనేశ్వరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తోన్న పోరాటంపై ఆమె స్పందించారు.

రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తోన్న పోరాటం చాలా గొప్పదని చెప్పారు. వారి ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బసవతారకం ఆసుపత్రితో పాటు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తాయని ఆమె చెప్పారు. ఇటీవల ఆమె రాజధాని పరిరక్షణ సమితికి భువనేశ్వరి. తన గాజులను విరాళంగా ఇచ్చిన విషయం విధితమే.

Related posts