టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ను ఈ రోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల చర్యతో టీడీపీ నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. తనపై నన్నపనేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్సై అనూరాధ ఆరోపించారు.
మహిళా కమిషన్కు చైర్పర్సన్గా వ్యవహరించిన నన్నపనేని బాధ్యతారహితంగా మాట్లాడారని విమర్శించారు. ఇంతలో అక్కడున్న టీడీపీ నేతలు, ఇతర పోలీసులు కల్పించుకోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఇతర మహిళా నేతలు ఉన్నారు.