telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు: నక్కా ఆనంద్ బాబు

nakka anand on tdp party with nri's

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబుఅన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలపై మంత్రి గౌతంరెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆనంద్ బాబు విమర్శలు చేశారు. పరిశ్రమలపై శ్వేతపత్రం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ శ్వేతపత్రంతో అభూత కల్పనలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను చెడగొట్టేలా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.

అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమను కూడా ఎంపీ మాధవ్ బెదరగొట్టారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి వేలాది పరిశ్రమలను నాడు తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ఏపీలో గవర్నమెంట్ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని సూచించారు.

Related posts