ప్రతిపక్ష నేత చంద్రబాబును మార్షల్స్ అడ్డుకోవడం దారుణమని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు.ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుర్భాషలాడారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని విమర్శించారు.
చంద్రబాబు మాటలను వైసీపీకి సిగ్గులేకుండా మార్ఫింగ్ చేసిందని ఆరోపించారు. అబద్ధాన్ని నిజం చేయాలని అధికారపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాసమస్యలపై చర్చించేందుకు కాకుండా వ్యక్తిగత దూషణల కోసం నిర్వహిస్తున్నట్లుందని విమర్శించారు.