telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఓట్ల కోసమే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు: టీడీపీ ఎంపీ సీతారామలక్ష్మి

TDP MP Seetharamalaxmi comments EBC Bill

ఓట్లు, సీట్ల కోసమే కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపేట్టారని టీడీపీ పార్లమెంటు సభ్యురాలు సీతారామలక్ష్మి విమర్శించారు. ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ వాయిదాపడ్డ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రాన్నీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేరళలో అయ్యప్ప స్వామిని కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఏడాదిగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

కాపుల రిజర్వేషన్ కూడా చాలాకాలంగా పెండింగ్ లో ఉందని సీతారామలక్ష్మి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదన్నారు. కాపుల కోసం బడ్జెట్ లో సీఎం రూ.1000 కోట్లు కేటాయించారనీ, ఉపాధి కల్పన కోసం రుణాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా హడావుడిగా లోక్ సభలో సభ్యులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts