telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి మరో ఎంపీ గుడ్ బై.. వైసీపీలో చేరనున్న రవీంద్రబాబు!

Tdp Mp Ravindrababu join YCP

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ప్రాంభమయ్యాయి. ఇప్పటికే ఎంపీ అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా తూ.గో: తెలుగుదేశం పార్టీకి అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు గుడ్‌ బై చెప్పారు. సోమ, మంగళవారంలో ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలవనున్నారు.

అమలాపురం టీడీపీ ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో రవీంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రవీంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకుంటున్నట్లుగా సమాచారం.కాగా ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ పి.రవీంద్రబాబు ఖండించిన విషయం తెలిసిందే. తాను టీడీపీని వీడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు.

Related posts