టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వస్తోంది. ముందుగా శుక్రవారం లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించాలనుకున్నా మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యతో వాయిదా పడింది. శనివారం తిరుపతిలో లోక్సభ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు.
దాదాపుగా ఖరారైన టీడీపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా:
విజయవాడ- కేశినేని నాని
గుంటూరు- గల్లా జయదేవ్
నరసరావుపేట- రాయపాటి సాంబశివరావు
బాపట్ల- శ్రావణ్ కుమార్
ఒంగోలు- శిద్దా రాఘవరావు
నెల్లూరు- బీదా మస్తాన్రావు
చిత్తూరు- శివప్రసాద్
తిరుపతి- పనబాక లక్ష్మి
కడప- ఆదినారాయణరెడ్డి
హిందూపురం- నిమ్మల కిష్టప్ప
అనంతపురం- జేసీ పవన్
శ్రీకాకుళం- రామ్మోహన్నాయుడు
విజయనగరం- అశోక్ గజపతిరాజు
అరకు- కిషోర్ చంద్రదేవ్
అనకాపల్లి- ఆడారి ఆనంద్
కాకినాడ- చలమలశెట్టి సునీల్
ఏలూరు- మాగంటి బాబు,
కర్నూలు- కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి
అమలాపురం- జీఎంసీ హరీష్
మచిలీపట్నం- కొనకళ్ళ సత్యనారాయణ
పెండింగ్ అభ్యర్థులు:
విశాఖ- శ్రీభరత్, రాజమండ్రి- మాగంటి రూప పెండిగ్ లో పెట్టారు. నరసాపురం, రాజంపేట, నంద్యాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
previous post
చంద్రబాబు విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులు: మంత్రి బొత్స