టీఆర్ఎస్, బీజేపీ సహకారంతో వైసీపీ అధినేత జగన్ సాక్షి వాహనాల్లో నగదు తరలిస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
ఐపీఎస్ అధికారుల బదిలీపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణల్లో ఉన్న 20 సాక్షి యూనిట్ల ద్వారా డబ్బును తరలిస్తున్నారని రవీంద్రకుమార్ ఆరోపించారు. సాక్షీ మీడియాలో వస్తున్న కథనాలను పెయిడ్ న్యూస్గా పరిగణించాలని ఆయన ఎన్నికల కమిషన్కు కోరారు.
పోలీసుల అధికారులపై విచారణ లేకుండా వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లుపొడిచారన్న.. ప్రధాని మోదీ ట్వీట్ని ఖండిస్తున్నామని కనకమేడల అన్నారు. ఏ ముఖంపెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజాయిషీ చెప్పుకుని ఆ తర్వాత తమ రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును తిట్టడానికే మోడీ ఏపీకి వస్తున్నారని కనకమేడల ఎద్దేవా చేశారు. పదేళ్లు కాంగ్రెస్లో ఉన్న పురందేశ్వరికి బీజేపీ టికెట్ ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు