telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎంకు అధికారాలు లేవని సీఎస్‌ ఎలా అంటారు: రాజేంద్రప్రసాద్‌

tdp leader rajendraprasad fire on ycp

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అధికారాలు లేవని సీఎస్‌ ఎలా అంటారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తోందని, టీటీడీ ఖజానా నుంచి తీసుకెళ్లీ మళ్లీ అప్పగించే బాధ్యత కూడా బ్యాంకులదేనని అన్నారు. టీటీడీ బంగారం తరలింపుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బ్యాంకులు కేంద్రం ఆధీనంలో ఉంటాయని.. అందుచేత తమకు కేంద్రంపైనే అనుమానం ఉందని ఆయన అన్నారు. టీటీడీ ఈవో సింఘాల్ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులు చనిపోతుంటే మోహన్‌బాబుకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఈవీఎంలపై ఈసీ వైఖరి మారాలని రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

Related posts