రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో టీడీపీ నేతల పై దాడులు పెరిగాయని విమర్శించారు.
దాడులు, అక్రమ కేసులు, కోడెల మృతిపై ఫిర్యాదులో పేర్కొన్నామని తెలిపారు. చేశామన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు కూడా కమిషన్కు ఇస్తామన్నారు. ఎన్హెచ్ఆర్సీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. వైసీపీ అరాచకాలను ఎండగడతామని అశోక్బాబు స్పష్టం చేశారు.