telugu navyamedia
ఆంధ్ర వార్తలు

స‌భ‌నుంచి వారిని బయటకు తోసేయండి : ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్

*ఏపీ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయిన స్పీకర్

*అసెంబ్లీ నుంచి ఒక‌రోజు టీడీపీ స‌భ్యులు సస్పెన్ష‌న్‌
*స్పీక‌ర్ పోడియం ద‌గ్గ‌ర టీడీపీ స‌భ్యులు నినాదాలు
*ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చించాల‌ని స‌భ్యులు ప‌ట్టు
*బాదుడే బాదుడు అంటూ టీడీపీ స‌భ్యులు నినాదాలు

ఏపీ అసెంబ్లీ నుంచి ఒక్క రోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు. పెరిగిన చార్జీలు, పన్నులపై  టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు అయితే ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.

అయితే ఈ విషయమై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు.‘బాదుడే బాదుడు’’ అంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వెల్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు.టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 

 సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు.

టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. వెంటనే అందుకు ఆమోదం తెలుపుతూ 14 మంది టీడీపీ సభ్యులను సభ నుండి చేస్తున్నట్టు ప్రకటించారు

అయితే వారు బయటకు వెళ్లకపోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ ది మార్షల్స్ అండ్ పుల్ దెమ్ అవుట్ అని  ఆవేశంగా స్పందించారు.

Related posts