పథకం ప్రకారం నాపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారని ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. ప్రభుత్వ కార్యాక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో రైతు భరోసా కార్యక్రమానికి వచ్చిన నన్ను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని అన్నారు. నా పై ఓటమిపాలైన వ్యక్తికి పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు. ఓడిపోయిన వ్యక్తికి సెక్యూరిటి కల్పించి, శాసనసభ్యునిగా ఉన్న నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసు అధికారులు చెప్పడం పై జిల్లా ఎస్పీ కీ ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఈ ప్రభుత్వంలో శాంతిభత్రలను పర్యవేక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకీ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. పలు జిల్లాలో అధికార బలంతో వైసీపీ దాడులకు తెగబడుతోందని ఎమ్మెల్యే అన్నారు. శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు.