ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తెలంగాణ ప్రగతిభవన్ లో నిన్న సీఎం కేసీఆర్ తో సండ్ర భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సండ్ర మాట్లాడుతూ.. కార్యకర్తలతో చర్చించి త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.
కేసులకు భయపడే వ్యక్తిని అయితే ఎప్పుడో పార్టీ మారేవాడినని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు సత్తుపల్లికి అందాలని, ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం రైతుల కలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజాసంక్షేమం కోసమే కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తానని సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు.
సీఎం కెసిఆర్ కు బండి సంజయ్ కౌంటర్..