telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వైసీపీ ఎంపీ బర్త్ డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే… ఏం జరుగుతోంది…!?

Balaram

ప్రకాశం జిల్లా, ఒంగోలులో మంగళవారం ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజు వేడుకలకు చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించే వరకు అక్కడే ఉన్నారు. అంతేకాదు ఎంపీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతూ ప్రసంగించారు. ఈ వేడుకలకు తన రాజకీయ వారసుడు, కుమారుడు కరణం వెంకటేష్‌‌ను కూడా తీసుకెళ్లారు. కొందరు అనుచరులు కూడా వెళ్లారట. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎంపీ మాగుంట బర్త్ డే వేడుకలకు వెళ్లడం ఆసక్తిగా మారింది. అయితే బలరాం అలా వెళ్లడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారు. మాగుంట ఎన్నికల ముందు వరకు టీడీపీలో కొనసాగారు.. ఎమ్మెల్సీగా ఉన్నారు.. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎంపీతో మంచి సాన్నిహిత్యం ఉండటంతోనే కరణం పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారని చెబుతున్నారు. అంతేకాదు బలరాం జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు. దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం సరికాదంటున్నారు.

Related posts