రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ఏపీ సీఎం జగన్ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.సోషల్ మీడియాలో కొందరు తనపై అసభ్యకర కామెంట్లు పెడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
అసభ్యకర కామెంట్లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా భవానీతో పాటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా పలువురు టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
ప్రపంచ కప్ గెలవకపోతే… తాను నిరాశకు గురవుతా: అజార్