telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆశావర్కర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్యే భవాని

bhavani tdp mla

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావర్కర్లపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని అసెంబ్లీలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఆశావర్కర్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆశావర్కర్లను తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు.

చాలీచాలని వేతనాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే ఆదుకుందని అన్నారు.
విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం ప్రజల కోసం సేవలందిస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వం ఆదుకోని, వారికి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేల జీతాన్ని తక్షణమే ఆశావర్కర్లకు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Related posts