telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సిద్ధం అవుతున్న టీడీపీ మేనిఫెస్టో… అధికారంలోకి వస్తే పింఛన్ 3000.. : చంద్రబాబు

TDP Change Puthalapattu Candidate

తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని కమిటీ ప్రజారంజక మేనిఫెస్టో తయారీలో తలమునకలైంది. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్న టీడీపీ.. మళ్లీ అధికారంలోకి వస్తే కనీస పింఛనును రూ. 3 వేలకు పెంచాలని నిర్ణయించింది.

గతంలో ఈ పింఛన్ రూ. 200 కాగా, ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రూ. 2 వేలు చేసింది. ఇప్పుడు టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచి మరోమారు అధికారంలోకి వస్తే దానిని మూడు వేలు చేస్తామని హామీ ఇవ్వబోతోంది. ఈ మేరకు మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది. పూర్తి మేనిఫెస్టో నేడో రేపో విడుదల చేయనున్నారు.

Related posts