తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని కమిటీ ప్రజారంజక మేనిఫెస్టో తయారీలో తలమునకలైంది. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్న టీడీపీ.. మళ్లీ అధికారంలోకి వస్తే కనీస పింఛనును రూ. 3 వేలకు పెంచాలని నిర్ణయించింది.
గతంలో ఈ పింఛన్ రూ. 200 కాగా, ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రూ. 2 వేలు చేసింది. ఇప్పుడు టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచి మరోమారు అధికారంలోకి వస్తే దానిని మూడు వేలు చేస్తామని హామీ ఇవ్వబోతోంది. ఈ మేరకు మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది. పూర్తి మేనిఫెస్టో నేడో రేపో విడుదల చేయనున్నారు.
మెగా ఫ్యామిలీ నిజమైన వారసుడు అల్లు అర్జున్… హీరోలపై మాధవి సంచలన కామెంట్స్