ప్రభుత్వం చేసే తప్పులను ప్రజా కోర్టులో పెడతామని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం పట్టిసీమ జలసిరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైతులకు అండగా నిలబడ్డామని చెప్పారు.
ఈ ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందని విమర్శించారు.నవరత్నాలు ప్రకటించినప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటో జగన్కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. రూ.1000 పెంచిన పెన్షన్ను ఒకేసారి ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎంకు ప్రజల సమస్యలు కనిపించడంలేదని లోకేశ్ దుయ్యబట్టారు.
నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేసిన చంద్రబాబు: జగన్