telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ముందస్తు సంబరాలు..జోహార్ కాదు జయహో!

TDP Change Puthalapattu Candidate

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ శ్రేణులు ముందస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జై టీడీపీ, జయహో చంద్రబాబు అని నినాదాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ నేత జోహార్ చంద్రబాబు అన్నారు.

దీంతో ఒక్కసారిగా మిగిలిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఖంగుతిన్నారు. వెంటనే అతడిని వారించిన మిగిలిన నేతలు నవ్వుల్లో మునిగిపోయారు. జోహార్ కాదు జయహో అని చెప్పాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts