telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

తలక్రిందులుగా తపస్సు చేసినా ఆయన గెలుపును ఆపలేరు: యామిని

TDP Yamini fire to Ys Jagan
ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్  తలక్రిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు  గెలుపును ఆపలేరని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. గురువారం అమ‌రావ‌తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కాబోతోందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. ఈ సారి  విప‌క్ష నేత‌ గా జగన్ గెలిచినా,  అసెంబ్లీకి రావాల‌ని మాత్రం ఉండ‌ద‌ని వీరి ప‌ట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించారు.
వైసీపీ పార్టీని అబద్దాలు పార్టీగా పేరు మార్చుకుంటే బాగుంటుంద‌ని  కామెంట్ చేసారు. ఇబిసి  రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం చూస్తుంటే వైసీపీ నాయకులు మిగతా కులాలను రెచ్చగొట్టి ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నార‌ని  విమ‌ర్శించారు. కాపు రిజర్వేషన్ పై జగన్మోహన్ రెడ్డి  ఒత్తిడికి గురై మాట్లాడుతున్నారు  రాష్ట్రంలోని వైసీపీ, బీజేపీ  పార్టీల వైఖరి తెలియజేయాలని ఆమె డిమాండ్ చేసారు.

Related posts