టీడీపీ నేత తూళ్ల వీరేందర్గౌడ్ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది. ఈనెల 3న భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. టీడీపీకి, ఆ పార్టీ పదవులకు వీరేందర్ ఇప్పటికే రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి రాజీనామా లేఖను పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వీరేందర్గౌడ్ తండ్రి టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కూడా బీజేపీలోకి వెళ్తారని మొదట ప్రచారం జరిగినా వివిధ కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరేందర్గౌడ్ ఒక్కరే టీడీపికి గుడ్ బై చెప్పడంతో కాషాయదళంలో చేరికపై స్పష్టత వచ్చింది. అంతేకాకుండా దేవేందర్ పెద్ద కుమారుడు, దేవేందర్ ఫౌండేషన్ ట్రస్టీ విజయేందర్ కూడా అదే రోజు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
నాకు ఇష్టం లేకపోయినా బెడ్ సీన్ లో నటించా : రాశి ఖన్నా