తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్ రెడ్డి కుమారుడు సామ తేజ్ పాల్ రెడ్డి (27)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ సాయి సింధూరి (27)ని సామ తేజ్ పాల్ రెడ్డి ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగితే, రేపు, మాపు అంటూ కాలం గడిపాడు. ఈ విషయమై గత డిసెంబర్ లోనే సింధూరి శంకర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసును పోలీసులు విచారిస్తుండగానే, ఇటీవల తేజ్ పాల్ రెడ్డి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీనితో అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. తేజ్ పాల్ పై ఐపీసీ సెక్షన్ 376, 417, 420 కింద కేసు పెట్టినట్టు వెల్లడించారు.
కేసీఆర్ తిట్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు!