టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు. అబద్ధాల కోరు జగన్, ట్వీట్ రాయుడు మోడీని ప్రజలు నమ్మరని విమర్శించారు. నారా లోకేశ్ పై మోదీకి ద్వేషం, అసూయ ఎందుకు? రాజకీయ భిక్ష పెట్టిన అద్వానీని మోడీ వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన నేతలకు జగన్ మళ్లీ టికెట్టు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరుతున్న సినీనటులపై ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్యాకేజీల కోసమే సినీనటులు వైసీపీలో చేరుతున్నారని ఆరోపించారు.
శ్రీరెడ్డి నిన్ను వదలా… ఎంతమందితో… : రాకేష్ మాస్టర్ ఫైర్