telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

త్వరలో జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టే ఆలా చేస్తున్నారు..

జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం చేసేది గోరంత, చెప్పేది కొండంతని…ప్రకటనల బడ్జెట్లో 50 నుంచి 60శాతం ఖర్చు సాక్షిపత్రికకే చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2కోట్ల71లక్షల37,253మంది బీసీలకు జగన్ ప్రభుత్వం రూ.33వేలకోట్ల సంక్షేమ పథకాలు అమలుచేసినట్లు ప్రకటనలో చెప్పారని…జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, వసతి దీవెన,ఇళ్లపట్టాల పథకాలతో ఆయావర్గాలకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారని పేర్కొన్నారు. ఆయా పథకాలన్నీ ప్రత్యేకంగా బీసీలకోసమే అమలుచేస్తున్నారా? అని ప్రశ్నించారు.

కార్పొరేషన్ల నిధులన్నింటినీ జగన్ ప్రభుత్వం అమ్మఒడి, ఇతర పథకాలకు మళ్లించారని.. బీసీ కార్పొరేషన్లకు చెందిన రూ.3,432కోట్లను అమ్మఒడిపథకానికి, బీసీలకు చెందిన వసతి దీవెన పథకానికి చెందిన రూ.202కోట్లను జీవోనెం-1243తో ఇతర పథకాలకు మళ్లించింది వాస్తవం కాదా? అని ఫైర్ అయ్యారు. ఈ విధంగా బీసీ కార్పొరేషన్లకు చిల్లిగవ్వ లేకుండా చేసి, 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తే దేనికి ఉపయోగం? అని నిలదీశారు. బ్రతికుండగానే పేర్లు ఎందుకు పెట్టారని చెప్పిన అంబటి, రోజా,ఇప్పుడు పథకాలకు పెట్టే పేర్లపై ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. త్వరలో జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టే, ఈ ప్రభుత్వం కక్కుర్తితో ఆయనపేరునే అడ్డమైన పథకాలకు పెరుతోందన్నారు. ప్రకటనలపేరుతో, కులాలప్రాతిపదికన పథకాలను అమలుచేస్తున్నట్లుగా ప్రజలను మోసగించాలంటే కుదరదని హెచ్చరించారు.

Related posts