telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కడపలో టీడీపీ నాయకుడి హత్య… ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లాకి చెందిన టీడీపీ నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిని చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో వైసిపి హత్యాకాండపై ధ్వజమెత్తిన చంద్రబాబు, చేనేత కుటుంబానికి చెందిన టిడిపి నాయకుడు సుబ్బయ్య హత్య కిరాతక చర్యగా అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుపెట్టడమే లక్ష్యంగా వైసిపి పెట్టుకుందన్న బాబు వైసిపి ఎమ్మెల్యే అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే నందం సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని అన్నారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ లో ఎమ్మెల్యే పాత్రను, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చడం కిరాతక చర్య అని ఆయన ఆనరు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టిడిపి నాయకుడి హత్య సిఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటని బాబు అన్నారు.  ఇళ్ల పట్టాల్లో అవినీతిని బైటపెట్టాడని, వైసిపి కుంభకోణాలను ప్రశ్నించాడని, నిరసనలు తెలిపాడని సుబ్బయ్యను హతమార్చడం రాక్షస చర్య అని బాబు పేర్కొన్నారు.

Related posts