telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరంపై మాట్లడటానికి మంత్రి పత్తాలేడు: దేవినేని

uma devineni

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు.పోలవరంపై మాట్లడటానికి మంత్రి పత్తాలేకుండా పోయారంటూ మండిపడ్డారు. టీడీపీపై బురద జల్లేందుకు పనులు ఆపేసి తప్పుడు రిపోర్టు ఇచ్చారని దేవినేని ఉమా ఆరోపించారు. ఇష్టారాజ్యంగా కాంట్రాక్ట్ సంస్థలను మారిస్తే పోలవరం ప్రాజెక్టు భద్రత ఎవరిదని ఇప్పటికే పీఏసీ ప్రశ్నించిందన్నారు.

రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బును కేంద్రం రీయింబర్స్‌ చేయడానికి.. జగన్‌ ప్రభుత్వం ఐదు నెలలుగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. పవర్‌ ప్రాజెక్ట్‌ కొట్టేయాలన్నదే జగన్ ఉద్దేశమని, పోలవరాన్ని 70 శాతం పూర్తి చేసిన నవయుగ కంపెనీని జగన్‌ కాదన్నారని ఆయన విమర్శించారు. బందరు పోర్టును నవయుగ కడుతుందని రద్దు చేశారన్నారు. ప్రజా ప్రయోజనాల పేరుతో అకారణంగా బందర్‌ పోర్టు రద్దు చేశారని ఆరోపించారు.

Related posts