telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డ్రోన్ రాజకీయాలు .. చంద్రబాబు హత్యకోసమే …: బుద్ధా వెంకన్న

ycp jagan with malya meeting said budda

టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. అందుకే చంద్రబాబు ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీశారని విమర్శించారు. చంద్రబాబు ఇంటి దగ్గర స్వయంగా వైసీపీ మంత్రులు రెక్కీ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుద్ధా వెంకన్న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుపై పన్నుతున్న కుట్రలను ఇప్పటికైనా వైసీపీ ఆపాలని సూచించారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించారు. చంద్రబాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని కోరారు.

Related posts