telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ చెప్పినట్లే నిపుణుల కమిటీ నివేదిక: టీడీపీ నేత బోండా ఉమ

tdp leader uma on parlament session speech

సీఎం జగన్ చెప్పినట్లే జీఎన్ రావు కమిటీ కమిటీ నివేదిక ఇచ్చిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాజధానిపై అమరావతి ప్రాంతంలో రైతులు చేపట్టిన ఆందోళనపై బోండా ఉమామహేశ్వరరావు ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారికే భూములు ఉన్నాయన్న కారణంగా ముందస్తు ప్రణాళికమేరకు జీఎన్ రావు కమిటీని నియమించిందన్నారు. వైసీపీ రాసిచ్చిన అంశాలమేరకే కమిటీ నివేదిక ఇచ్చిందని విమర్శించారు.

అమరావతి ప్రాంత అభివృద్ధికి టీడీపీ కట్టుబడింది. అమరావతి రాజధానిగా నిర్మాణ ప్రక్రియ ప్రారంభం చేశాం. రోడ్లు నిర్మించాం. భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. పరిశ్రమలు కూడా వచ్చాయి. రాజధాని మార్పుపై వైసీపీ నేతలు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి ప్రాంత రైతుల ప్రయోజనాలకోసం అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉంటామని అన్నారు.

Related posts