వైసీపీ ఎంపీ విజయసారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ..16 నెలల పాటు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడిందన్నారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడిన చారలు చూసుకొని విజయ సాయిరెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదని సెటైర్ వేశారు.
బెయిల్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ.
నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!’’ అని ట్వీట్లో అయ్యన్న పేర్కొన్నారు.
అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను
రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!. 2/2@VSReddy_MP— Ayyanna Patrudu (@AyyannaPatruduC) June 25, 2022
కాగా.. ఇటీవల నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
యురేనియం తవ్వకాల పై స్పందించిన అఖిలప్రియ