క్రిస్మస్ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు విజయవాడ ఎంపీ కేశినేని ఆసక్తికర ట్వీట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూనే.. అధికారపక్షంపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్కు, ఆయన గ్యాంగ్కు, వైసీపీకి ప్రత్యేకమైన క్రిస్టమస్ శుభాకాంక్షలు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు. మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్టమస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండని వ్యాఖ్యానించారు. ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.